AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ విజయానంద్ ని సూటిగా ప్రశ్నించింది. దీంతో ఖచ్చితంగా చేస్తామని కోర్టుకు సీఎస్ తెలిపారు. ఎప్పటిలోగా అమలు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ లో చేశామన్న సీఎస్.. 15 రోజుల సమయం సరిపోదా అని సీఎస్ ను కోర్టు క్వశ్చన్ చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టులు ఎందుకని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అయితే, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం పేర్కొనింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే సామాన్యులకు కోర్టులపై నమ్మకం కోల్పోతారని తెలిపింది. అధికారులకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేకపోయినా అధికారులపై మాకు గౌరవం ఉందన్నారు.
Read Also: Anthropic AI: ఈసారి “హెచ్ఆర్”లకే ఎసరు.. క్లాడ్ ఏఐ కొత్త ఫీచర్లతో ఉద్యోగాలకు ముప్పు?
సీఎస్ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా మిగతా అధికారులకి ఏం మెసేజ్ ఇస్తున్నారని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. సీఎస్ ను వివరణ అడిగితే ఏజీ వాదనలు వినిపించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులపై సరైన క్లారిటీ లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. పోస్టులపై పూర్తి క్లారిటీ ఉంది చెప్పమంటే చెబుతా అని న్యాయస్థానం అడిగింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కోర్టుకు ఏజీ వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు సీఎస్ విజయానంద్.
