AP GOVT : ఆ పాఠశాల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పై జగన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఇంతకు ఆ సమస్య ఏమిటంటే. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని ఎకోపాధ్యాయ పాఠశాలలు అలాగే కొన్ని ఇద్దరు ఉపాధ్యాయులు వున్న పాఠశాలలు ఉన్నాయి.ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజుకి పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది.పాఠశాల మూసి వేయడం వలన విద్యార్ధుల చదువుకు ఆటంకం కలుగుతుంది.ఎప్పుడో ఒకరోజు అయితే ఫర్వాలేదు కానీ రోజుల తరబడి సెలవుల్లో ఉంటే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులపై గతంలో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యాసంస్కరణలు అలాగే మధ్యాహ్న భోజనం, ఇతర కార్యక్రమాల కారణంగా ఉపాధ్యాయులు కొంత ఒత్తిడికి గురవుతున్నారు.
మామూలు పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడుతో నడిపించవచ్చు. కానీ ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవులు పెట్టడం వలన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దీంతో ఉన్నతాధికారులు ఆయా ఉపాధ్యాయులకు సెలవులను నిరాకరిస్తున్నారు. దీంతో వారు చెప్పకుండానే సెలవు పెట్టడం లేదా స్కూలుకు వచ్చినట్లే వచ్చి మధ్యలోనే వెళ్లిపోవడం వంటి పనులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అనే వ్యవస్ధ గతంలోనే వున్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవస్థ పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ను క్లస్టర్ మొబైల్ రిజర్వ్ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి తమ పరిధిలో ఉన్న కనీసం మూడు నుంచి నాలుగు స్కూళ్లను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.వారి పరిధిలో ఎక్కడ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా వీరు ఆయా పాఠశాలకు వెళ్లి బోధన కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ను కూడా విడుదల చేసింది.
Also Read
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!