5 Working Days: సచివాలయ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. 5 రోజుల పనిదినాలు పొడిగింపు..
- సచివాలయం.. వివిధ హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్..
- నేటి నుంచి ఏడాది పాటు అమల్లో ఉండనున్న వారానికి ఐదు రోజుల పని విధానం..
5 Working Days: సచివాలయంతో పాటు.. వివిధ హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సచివాలయంతో పాటు హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. ఇవాళ్టి నుంచి వారానికి ఐదు రోజుల పనివిధానం అమల్లోకి వస్తుందని.. నేటి నుంచి ఏడాది పాటు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్.
Read Also: Prakasam District: అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
కాగా, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు.. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.. రాజధానిలో క్వార్టర్స్తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.. విభజన తర్వాత హైదరాబాద్లోనే తమ కుటుంబాలు ఉండడంతో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. ఆ ర్వాత హైదరాబాద్కు వచ్చి వారి కుటుంబాలతో గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలనుకున్నారు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని ఎత్తివేయాలనే ఆలోచన చేసింది.. కానీ, ఉద్యోగుల విజ్ఞప్తితో ఆ వెసులుబాటును కొనసాగించింది.. అమరావతి నిర్మాణం అగిపోయినా.. ఉద్యోగుల ఐదు రోజుల పనివిధానం కొనసాగుతూ రాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అమరావతి రాజధానిపై వేగంగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో.. ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!