5 Working Days: సచివాలయ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. 5 రోజుల పనిదినాలు పొడిగింపు..
- సచివాలయం.. వివిధ హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్..
- నేటి నుంచి ఏడాది పాటు అమల్లో ఉండనున్న వారానికి ఐదు రోజుల పని విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Working Days: సచివాలయంతో పాటు.. వివిధ హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సచివాలయంతో పాటు హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. ఇవాళ్టి నుంచి వారానికి ఐదు రోజుల పనివిధానం అమల్లోకి వస్తుందని.. నేటి నుంచి ఏడాది పాటు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్.
Read Also: Prakasam District: అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
కాగా, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు.. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.. రాజధానిలో క్వార్టర్స్తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.. విభజన తర్వాత హైదరాబాద్లోనే తమ కుటుంబాలు ఉండడంతో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. ఆ ర్వాత హైదరాబాద్కు వచ్చి వారి కుటుంబాలతో గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలనుకున్నారు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని ఎత్తివేయాలనే ఆలోచన చేసింది.. కానీ, ఉద్యోగుల విజ్ఞప్తితో ఆ వెసులుబాటును కొనసాగించింది.. అమరావతి నిర్మాణం అగిపోయినా.. ఉద్యోగుల ఐదు రోజుల పనివిధానం కొనసాగుతూ రాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అమరావతి రాజధానిపై వేగంగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో.. ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!