Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్కు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి నెలకొన్న మ్యుటేషన్ సమస్యలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 51,603 ఎకరాల భూములను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో (వెబ్ ల్యాండ్) ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం..
Also Read
చాలా కాలంగా ఏపీఐఐసీ వద్ద ఉన్న భూములు రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కాకపోవడం వల్ల, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు పొందడంలోనూ.. భూ బదలాయింపు ప్రక్రియలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఈ కీలక అడుగు వేసింది.
Also Read:Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ..
22A జాబితా నుంచి మినహాయింపు..
మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న సుమారు 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను నిషేధిత భూముల జాబితా (22A) నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూముల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ ప్రక్రియను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమలు విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. భూముల మ్యుటేషన్ , 22A తొలగింపు ప్రక్రియను కేవలం 15 రోజుల్లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయడం ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!