Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్కు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి నెలకొన్న మ్యుటేషన్ సమస్యలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 51,603 ఎకరాల భూములను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో (వెబ్ ల్యాండ్) ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం..
Also Read
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
చాలా కాలంగా ఏపీఐఐసీ వద్ద ఉన్న భూములు రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కాకపోవడం వల్ల, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు పొందడంలోనూ.. భూ బదలాయింపు ప్రక్రియలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఈ కీలక అడుగు వేసింది.
Also Read:Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ..
22A జాబితా నుంచి మినహాయింపు..
మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న సుమారు 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను నిషేధిత భూముల జాబితా (22A) నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూముల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ ప్రక్రియను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమలు విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. భూముల మ్యుటేషన్ , 22A తొలగింపు ప్రక్రియను కేవలం 15 రోజుల్లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయడం ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!