AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం.
ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. అంతేకాకుండా వినతలను కూడా స్వీకరించింది. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది.
Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
కేంద్రం జనగణన చేయనున్నడంతో 2026 నుంచి 27 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్చేందుకు వీలుండదు. కాబట్టి, 2025 డిసెంబర్ 31 లోపు జిల్లాల పునర్విభజన హద్దుల్లో మార్పులు చేర్పులు పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగుణపాలం, దర్శి కలిపి ఐదు నియోజక వర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించే ఛాన్స్ ఉంది.
అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజక వర్గాలని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజక వర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజక వర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది.
Hyderabad Rains : కొట్టుకుపోయిన పునాది.. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు.!
ఇక గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు నియోజక వర్గాలు అవుతాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజక వర్గాలని ఎన్టీఆర్ జిల్లాలో కలపొచ్చు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజక వర్గాలు అవుతాయి. కృష్ణా జిల్లాలో ఐదు నియోజక వర్గాలు ఉండే అవకాశం ఉంది.