AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. వర్షాకాల సమావేశాలలోపే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం.
ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. అంతేకాకుండా వినతలను కూడా స్వీకరించింది. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
కేంద్రం జనగణన చేయనున్నడంతో 2026 నుంచి 27 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్చేందుకు వీలుండదు. కాబట్టి, 2025 డిసెంబర్ 31 లోపు జిల్లాల పునర్విభజన హద్దుల్లో మార్పులు చేర్పులు పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగుణపాలం, దర్శి కలిపి ఐదు నియోజక వర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించే ఛాన్స్ ఉంది.
అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజక వర్గాలని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజక వర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజక వర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది.
Hyderabad Rains : కొట్టుకుపోయిన పునాది.. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు.!
ఇక గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు నియోజక వర్గాలు అవుతాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజక వర్గాలని ఎన్టీఆర్ జిల్లాలో కలపొచ్చు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజక వర్గాలు అవుతాయి. కృష్ణా జిల్లాలో ఐదు నియోజక వర్గాలు ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!