AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
- కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్
- మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు
- సీఐ గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీ మద్యం తయారీ విషయంలో ఇంటి దొంగల పాత్ర గుర్తించడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు వేసింది. ఇప్పుడు కేసులకు కీలక నిందితుడు జనార్దన్ బార్, అదే విధంగా కల్తీ మద్యం తయారీ డంప్ బయటపడిన పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. సీఐ పరిధిలో జనార్ధన్, అతని అనుచరుడు కళ్యాణ్ స్థానిక శ్రీనివాస వైన్స్లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం అమ్మకాలు జరిపినట్టుగా కూడా అధికారులు గుర్తించారు.
ఇంత జరుగుతున్నా కల్తీ మద్యం వ్యవహారం గుర్తించకపోవడంపై సీఐ గోపాలకృష్ణపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు స్టేషన్ పరిధిలో కొందరు సిబ్బంది బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని, అండగా నిలుస్తున్నారని ఇప్పటికే గుర్తించారు. వీరిలో కల్తీ ఆమ్మకం జరుపుతున్న కొందరికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శాఖా పరంగా అంతర్గత విచారణ చేపట్టారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవటానికి ఎక్సైజ్ కమిషనర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
Also Read: AP Cabinet Meeting: కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!
మరోవైపు కల్తీ మద్యం కేసుకు సంబంధించి నిందితుడుగా ఉన్న కళ్యాణ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్ పిన్ని కుమారుడే కళ్యాణ్. ఏడాది క్రితమే శ్రీనివాస వైన్స్ మేనేజర్గా చేరాడు. కల్తీ మద్యం వారానికి 50 కేసులు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. జనార్ధన్ బార్లో కల్తీ మద్యం గుర్తించిన విషయం తెలియగానే వైన్స్లో ఉన్నటువంటి 60 కేసులు మధ్యన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. ఇటీవల గొల్లపూడిలో 3 కోట్ల భూమి కొన్నట్టు సమాచారం రావటంతో కళ్యాణ్ ఆర్ధిక లావాదేవీలు అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?