AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
- కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్
- మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు
- సీఐ గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీ మద్యం తయారీ విషయంలో ఇంటి దొంగల పాత్ర గుర్తించడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు వేసింది. ఇప్పుడు కేసులకు కీలక నిందితుడు జనార్దన్ బార్, అదే విధంగా కల్తీ మద్యం తయారీ డంప్ బయటపడిన పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. సీఐ పరిధిలో జనార్ధన్, అతని అనుచరుడు కళ్యాణ్ స్థానిక శ్రీనివాస వైన్స్లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం అమ్మకాలు జరిపినట్టుగా కూడా అధికారులు గుర్తించారు.
ఇంత జరుగుతున్నా కల్తీ మద్యం వ్యవహారం గుర్తించకపోవడంపై సీఐ గోపాలకృష్ణపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు స్టేషన్ పరిధిలో కొందరు సిబ్బంది బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని, అండగా నిలుస్తున్నారని ఇప్పటికే గుర్తించారు. వీరిలో కల్తీ ఆమ్మకం జరుపుతున్న కొందరికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శాఖా పరంగా అంతర్గత విచారణ చేపట్టారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవటానికి ఎక్సైజ్ కమిషనర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Also Read
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
Also Read: AP Cabinet Meeting: కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!
మరోవైపు కల్తీ మద్యం కేసుకు సంబంధించి నిందితుడుగా ఉన్న కళ్యాణ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్ పిన్ని కుమారుడే కళ్యాణ్. ఏడాది క్రితమే శ్రీనివాస వైన్స్ మేనేజర్గా చేరాడు. కల్తీ మద్యం వారానికి 50 కేసులు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. జనార్ధన్ బార్లో కల్తీ మద్యం గుర్తించిన విషయం తెలియగానే వైన్స్లో ఉన్నటువంటి 60 కేసులు మధ్యన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. ఇటీవల గొల్లపూడిలో 3 కోట్ల భూమి కొన్నట్టు సమాచారం రావటంతో కళ్యాణ్ ఆర్ధిక లావాదేవీలు అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!