Election Commission: హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. నేడు మూడు జిల్లాల ఎస్పీల వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. తమ ముందు హాజరై ఆ హింసాత్మక ఘటనలకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. ఇవాళ ఎన్నికల సంఘం ముందు హాజరుకానున్నారు మూడు జిల్లాల ఎస్పీలు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సీఈవో ఎంకే మీనా ఆదేశించారు.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరుకానున్నారు ఆ మూడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి.
Read Also: Priyanka Chopra : అయోధ్య రాముడిని దర్శించుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..
Also Read
చాగలమర్రి, గిద్దలూరుల్లోని హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై వివరణతో కోరింది ఎన్నికల కమిషన్.. ఆయా ఘటనకు గల కారణాలు, హింసాకాండకు గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.. హింసని నివారించేందుకు ఎలాంటి చర్టలు తీసుకున్నారోననే అంశాన్ని కూడా వివరించాలని పేర్కొంది ఎన్నికల కమిషన్.. ఇక, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలు ఇచ్చే వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు సీఈవో ఎంకే మీనా..
Read Also: Amala Paul: తల్లి కాబోతున్న అమలా పాల్.. ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ..!
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత హింసాత్మక సంఘటనలు జరిగిన మూడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను గురువారం తన ముందు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ముఖేష్ కుమార్ మీనా సమన్లు జారీ చేశారు.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒకటి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రెండు హత్యలు, కారును తగులబెట్టిన ఘటనలను కమిషన్ సీరియస్గా తీసుకుందని అన్నారు. ఈ ఘటనలపై విచారణ నిమిత్తం మూడు జిల్లాల ఎస్పీలను సీఈవో కార్యాలయానికి పిలిపించినట్లు మీనా తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్సీపీ ఈ ఘటనలకు పాల్పడిందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కూటమి ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్భంగా భద్రతా ఉల్లంఘనలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖను సీజ్ చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. సమస్య యొక్క మరియు తగిన చర్య తీసుకుంటుంది. “హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సమస్యపై వ్యాఖ్యానించడానికి నాకు అధికారం లేదు” అని ఆయన చెప్పారు. ఎన్నిల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు గ్రామ మరియు వార్డు వాలంటీర్లపై తీసుకున్న చర్యను ప్రస్తావిస్తూ.. ఇప్పటి వరకు, మేం 40 మంది వాలంటీర్లతో సహా 46 మంది ఉద్యోగులపై చర్య తీసుకున్నాం.. రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లను సర్వీసు నుంచి తొలగించామని వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?