Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Dgp Report To Cs Over Incidents Of Violence Before And After Polling 2024

AP Elections 2024: పోలింగ్‌ ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు.. సీఎస్‌కు డీజీపీ నివేదిక

NTV Telugu Twitter
Published Date :May 17, 2024 , 8:00 am
By Sudhakar Ravula
AP Elections 2024: పోలింగ్‌ ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు.. సీఎస్‌కు డీజీపీ నివేదిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముందు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి నివేదిక ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా.. ఎన్నికల ముందు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగేందుకు బాధ్యులైన 12 మంది సబార్డినేట్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు.. శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు.. దీంతో.. డీజీపీ నివేదిక మేరకు వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ శాఖా పరమైన విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. తిరుపతి, అనంతపురం, పలనాడు జిల్లాల సబర్దినేట్ అధికారులు తమ విధుల్లో తీవ్ర స్థాయి నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేసింది నివేదిక.. పలనాడు జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకర్గంలో ఎన్నికల ముందు, తర్వాత హిసాత్మక ఘటనలు జరిగాయని స్పష్టం చేసింది..

Read Also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక

ఇక, ఈ ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో ఉన్న పోలీసు అధికారులు అనైతికంగా, విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేశారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. జరిగిన ప్రతీ హింసాత్మక ఘటనలోనూ సదరు పోలీసు అధికారుల పూర్తి నిర్లక్ష్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఘటనల తీవ్రత పెంచాయని వెల్లడించింది డీజీపీ నివేదిక. చట్టాన్ని, శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా పోలీసు అధికారులు విఫలం అయినట్టు స్పష్టం చేసింది.. జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలోనూ అలాంటివి జరగకుండా శాంతి భద్రతలు కాపాడటంలో ఈ అధికారులు విఫలం అయినట్టు వెల్లడించారు. విధుల పట్ల ఈ అధికారుల నిజాయితీ, నిబద్ధతపై కూడా అనుమానం వ్యక్తం అవుతోందని డీజీపీ నివేదిక పేర్కొంది. ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో వీరు పూర్తిగా విఫలం అయ్యారని స్పష్టం చేసింది.. ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల్లోని సెక్షన్ 3(1)ను వీరు పూర్తిగా అతిక్రమించారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా..

Read Also: Swati Maliwal: విభవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. కేసు దర్యాప్తులో నిమగ్నమైన 10 బృందాలు

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) రియాక్షన్‌ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త FIR రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ.. సీఎస్, డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap cs
  • ap dgp
  • AP Elections 2024
  • AP Violence
  • Polling 2024

తాజావార్తలు

  • Narendra Modi : 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి.. యోగాపై ఇకో సిస్టంని డెవలప్‌ చేస్తున్నాం

  • Pawan Kalyan: యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ

  • Shruti Hassan : దాని గురించి దాచాల్సిన అవసరం లేదు..

  • CM Chandrababu : సెప్టెంబర్‌ నుంచి యోగా లీగ్‌ ప్రారంభం.. గిరిజన విద్యార్థులు రికార్డ్‌ సృష్టించారు

  • Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions