Swati Maliwal: విభవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. కేసు దర్యాప్తులో నిమగ్నమైన 10 బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న రాత్రి పోలీసులు బాధితురాలు స్వాతి మలివాల్ను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్కు తీసుకెళ్లారు. మలివాల్ 4 గంటల పాటు ఎయిమ్స్లోనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులు స్వాతి మలివాల్ను ఎయిమ్స్లోని ట్రామా సెంటర్కు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆజ్ తక్ కరస్పాండెంట్ స్వాతి మలివాల్తో విచారణ కోసం ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) బృందం కూడా AIIMSకి చేరుకుంది.
READ MORE: IPL 2024 Playoffs: హైదరాబాద్కు గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే సెకండ్ ప్లేస్ పక్కా!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాగా.. కేసు నమోదు అనంతరం నార్త్ జిల్లా పోలీసు బృందం, క్రైమ్ బ్రాంచ్ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ముందుగా ఢిల్లీ పోలీసు బృందం విభవ్ కుమార్ ఇంటికి చేరుకుంది. విభవ్ అక్కడ లేరు. ఇంట్లో అతని భార్య ఉంది.ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈరోజు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు విభవ్ కుమార్ను హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం లక్నో విమానాశ్రయంలో అరవింద్ కేజ్రీవాల్తో విభవ్ కుమార్ కనిపించారు. ఇండియా కూటమి నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ లక్నో వచ్చారు. పోలీసులు ఇప్పుడు టైమ్లైన్ ద్వారా మొత్తం సంఘటనను సీక్వెన్స్ చేస్తున్నారు. సీక్వెన్స్ ప్రకారం.. విభవ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీని ఫుటేజీ సహాయం తీసుకున్నారు. ఈ రోజు మహారాష్ట్రలో ఇండియా కూటమి ర్యాలీ ఉంది. విభవ్ మహారాష్ట్రకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 10 పోలీసు బృందాలు దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. అందులో నాలుగు బృందాలు విభవ్ ఎక్కడున్నాడో కనుగొనేందుకు యత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!