Dy Cm Rajanna Dora: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ ఎస్ పార్టీగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రాజకీయ పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తోటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర విజయనగరంలో దీనిపై స్పందించారు. జాతీయస్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు పై స్పందించిన రాజన్నదొర.. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు…అదే విధంగా కేసీఆర్ కుడా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి వుంటారన్నారు.
Read Also: Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
దీనివల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అంధ్రలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం అన్నారు రాజన్న దొర. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలంటేనే కేసిఆర్ ఒప్పుకోలేదు. అలాంటిది ఆంధ్రాలో వచ్చి కేసిఆర్ పెత్తనం చేస్తానంటే మనం ఎలా ఒప్పుకుంటాం. మనుగడ సాగించలేని కొన్ని రాజకీయ పార్టీలు కేసిఆర్ పార్టీలో చేరొచ్చు గాని వైస్సార్ లో వాళ్లు వేళ్లేదే లేదు.. అలాగే టిడిపి పార్టీలో కొందరు అవకాశాలు లేక నిరాశ, నిసృహత ఉన్నవారు కేసిఆర్ పంచన చేరవచ్చు అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.
వైఎస్సార్ పార్టీ పటిష్టంగా ఉంది 175 సీట్లు కి 151 తెచ్చుకుని ప్రజా రంజకపాలన చేస్తుంది…ఉత్తరాంధ్రలో తమ వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని పార్టీలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. వైస్సార్ పార్టీ నుండి ఎవరు బీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరన్నారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఏ పార్టీ పోటీ కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్ ను ఏపీలో ఆదరించే పరిస్థితి లేదు..టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాదు ఎన్ని పార్టీలు వస్తే వాళ్ళే అంత పలచన అవుతారు.. ఇక్కడ ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీకి పోటీ వుండదు..మరో25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీకి సీఎంగా వుంటారని ధీమా వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!