Pawan Kalyan: నీరు దొరకనప్పుడే.. నీటి విలువ తెలుస్తుంది: డిప్యుటీ సీఎం
- జలజీవన్ మిషన్ ప్రధాని కల
- ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం
- జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు. జలజీవన్ మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ కల అని, ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం అని తెలిపారు. జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం అని డిప్యుటీ సీఎం చెప్పారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ వర్క్ షాప్ను డిప్యుటీ సీఎం పవన్ ప్రారంబించారు. ఈ వర్క్ షాప్లో 26 జిల్లాల సీనియర్ ఇంజనీర్లు, డీఆర్ఈలు పాల్గొన్నారు. 26 జిల్లాలలోని నీటిపారుదల సదుపాయాలు, వినియోగకరమైన నీటి వనరులపై సమీక్ష జరిగింది.
డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘జలజీవన్ మిషన్ ప్రధాని మోడీ కల. ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలనేదే ఈ మిషన్ ఉద్దేశం. ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నది మా ఉద్దేశం. నీటి వినియోగంలో ఐటీ వినియోగం కూడా భాగం. అమృతధార అనే పేరుతో ఇది మనం చేస్తున్నాం. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుంది. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుంది. కేంద్రం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలని అంటే.. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేసింది. 38 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు, వాటి నుంచి సరఫరా ఉండాలి. బోర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వంలో 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి’ అని అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం. జలజీవన్ మిషన్లో బోర్ వెల్స్ ను వాడటంవల్ల ఉపయోగం లేకుండా పోయింది. జిల్లాల వారీగా జలజీవన్ మిషన్ అమలులోని ఇబ్బందులను తెలుసుకోవాలనే ఈ వర్క్ షాప్ నిర్వహించాం. మానవతా దృక్పధంతో జలజీవన్ మిషన్ అమలు కావాలి. ఈ మిషన్లో పైప్ లైన్ డిజైనింగ్లో లోపాలున్నాయి. నీళ్ళొస్తుంటే మధ్యలో మోటార్లు వేసి లాగేయకుండా చూడాలి. డబ్బులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదు. అవసరమైన చోట టెక్నాలజీని చేర్చడం జరుగుతుంది. ఫిల్టర్ బెడ్లను కూడా చాలా చోట్ల మార్చలేదు. క్షేత్రస్ధాయిలో సలహాలు, సూచనలు అధికారులు ఇవ్వాలి. ఇవాళ సాయంత్రానికి ఈ జలజీవన్ మిషన్కు ఒక స్ధిరమైన సాధన సహకారాలు కావాలి’ అని డిప్యుటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!