CM Jagan Vizag Tour: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Vizag Tour: రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Read Also: Chandrababu: వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. రా కదలి రా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన వివరాలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్లో పర్యటన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారని.. విశాఖను ఒక గ్లోబల్ సిటీగా మార్చాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ కు గేట్ వేగా వైజాగ్ను చూడాలనేది సీఎం ఉద్దేశమని మంత్రి తెలిపారు. విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారన్నారు. గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారని మంత్రి చెప్పారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్ను సీఎం జగన్ విడుదల చేస్తారని వెల్లడించారు.
1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్కు శంకుస్థాపన సీఎం జగన్ చేయనున్నారని చెప్పుకొచ్చారు. 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 7వ తేదీన అనకాపల్లిలో ఆసరా 4వ విడత కార్యక్రమంను ప్రారంభిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!