Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jaganmohan Reddy Speech In Memantha Siddham Sabha At Nandyal

CM YS Jagan: ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. ఆలోచన చేయండి..

NTV Telugu Twitter
Published Date :March 28, 2024 , 7:08 pm
By Mahesh Jakki
CM YS Jagan: ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. ఆలోచన చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందని సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ సభలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని.. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని సీఎం అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని… ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి అంటూ జగన్‌ పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. ఈ ఎన్నికలు మోసాల చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు.

Read Also: Purandeswari: ఏపీలో బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం..

ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని.. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామన్నారు. “నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం జగన్‌ వివరించారు. ఇటువైపు నేను ఒక్కడ్నే, అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్.. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు.. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధమన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధమంటూ సీఎం జగన్‌ వెల్లడించారు. “డబుల్‌ సెంచరీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లు కూడా ముందుకు తీసుకువెళ్దాం..ఈ ఎన్నికల మనకు జైత్రయాత్ర.. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం.. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి.. వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి.. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి.” అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

Read Also: Kodali Nani: అలా ఒక్కరితో చెప్పించినా పోటీ చేయను.. ప్రచారంలో కొడాలి నాని సవాల్

రూ.2లక్షల 77 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 58 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, మత్య్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, ముప్ఫు లక్షల ఇళ్ల పట్టాలు.. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. చదువులకు అనుసంధనం చేస్తూ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అమలు చేశామన్నారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుందని సీఎం జగన్‌ విమర్శించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయన్నారు. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా అంటూ సీఎం ప్రశ్నించారు.” పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?” సీఎం ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ మరొకసారి మోసం చేయడానికి వస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM YS Jaganmohan Reddy
  • CM Jagan Election Compaign
  • latest news
  • Memantha Siddham Sabha

తాజావార్తలు

  • SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా

  • RajniKanth : ఆ దర్శకుడితో రజనీ సినిమా.. వర్కౌట్ అవుతుందా.?

  • Trump: పాక్ ఆర్మీ చీఫ్‌కు ట్రంప్ ప్రత్యేక విందు.. ఇద్దరి భేటీపై వైట్‌హౌస్‌ ఏం తేల్చిందంటే..!

  • QS World University Ranking 2026: ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో.. 50 భారతీయ వర్సిటీలు.. టాప్ లో ఐఐటీ ఢిల్లీ

  • YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!

ట్రెండింగ్‌

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions