NTV Telugu Site icon

CM Jagan: పక్కవాడు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు..

Jagan Pawan

Jagan Pawan

AP CM: ఇవాళ భీమవరంలో సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు, మోసాలు చెప్పడమే వారి రాజకీయం చేస్తున్నాడన్నారు. దత్తపుత్రుడిని భీమవరంలో ప్రజలు తిరస్కరించారు.. దత్త పుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుంది.. పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టినవాడు పవన్ కళ్యాణ్‌ తప్ప ఎవరూ లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also: MP Ram Mohan Naidu: రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జీవితం ఉంది అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు.. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను చూసి ఉండమన్నారు. ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారు.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడు ఈ మ్యారేజ్ స్టార్ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా? అని సీఎం జగన్ అడిగారు.