Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Chandrababu Sensational Comments On Rushikonda Palace

AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు

NTV Telugu Twitter
Published Date :November 2, 2024 , 5:12 pm
By Mahesh Jakki
  • రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయి
  • నిర్మాణ వ్యయం బిల్లులు అన్నీ ప్రజల ముందు పెడతా
  • సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP CM Chandrababu: రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించుకోవడం చేయలేదన్నారు. రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు.

Read Also: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

నిర్మాణ వ్యయం బిల్లులు అన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. టబ్ కోసం 36లక్షలు, కమోడ్ కోసం 12లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. 9.88ఎకరాల్లో ఏడు బ్లాకుల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించారని చెప్పారు. 13వేల 543చదరపు మీటర్ల నిర్మాణం జరిగిందన్నారు. అదిరిపోయే బిల్డింగ్‌లు నిర్మించి కొండను తొలిచేసి కొండ చరియలు విరిగిపడకుండా జపాన్ టెక్నాలజీ వాడారని వెల్లడించారు. వైట్ హౌస్, రాష్ట్ర పతి భవన్‌లో కూడా లేని కారిడార్లు నిర్మించారని చెప్పారు. చాలా దేశాలు తిరిగాను కానీ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎలా వచ్చిందా…అని ఆశ్చర్యం కలుగుతుందన్నారు. రుషికొండ మీద విచారణ చేస్తే చాలా మంది ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. జగన్ ఆంధ్రా ఎస్కో బార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం అంటే లెక్క లేకుండా వ్యవహరించారన్నారు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం 700కోట్లు పైగా ఖర్చు చేశారన్నారు. భోగ విలాసాల కోసం ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు.

Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..

రుషికొండ నిర్మాణాలపై చర్చ జరగాలని.. ప్రజలు కూడా దీనిపై అభిప్రాయం చెప్పొచ్చన్నారు. ఋషికొండను ఏం చెయ్యాలో తనకు అర్థం కావడం లేదన్నారు. రుషికొండలో ప్రజా ధనం దుర్వినియోగంపై వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. విశాఖ రాజధాని పేరుతో మభ్య పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పనులు చేసి ఎదురు దాడికి పాల్పడటానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజా కోర్టులో రుషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా రుషికొండ కాస్ట్లీ ఎఫైర్ అయ్యిందన్నారు. రుషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. రుషికొండ చర్చ అవసరం లేదు శిక్ష మిగిలింది.. అందులో ప్రభుత్వం వెయ్యాలిసింది.. ప్రజలు వెయ్యాలసినది మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రజా చైతన్యం కోసం పోలవరం చూపించాం.. ప్రజాస్వామ్యంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో చూడాలంటే రుషికొండ రావాలన్నారు. రుషికొండ నిర్మాణ, నిర్వహణ వ్యయం భారీగా ఉందన్నారు. తాను ఓపెన్‌ మైండ్‌తో ఉన్నానన్నారు. రుషికొండ దగ్గర పరిశీలన కోసం వచ్చిన వాళ్ళ పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM Chandrababu
  • latest news
  • Rushikonda Palace
  • telugu news

తాజావార్తలు

  • Tollywood: రేపే సీఎం చంద్రబాబు, పవన్తో సినీ ప్రముఖుల భేటీ..

  • India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..

  • Revanth Reddy: సోమవారం రైతులతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు

  • Devara 2: ఎన్టీఆర్ చెప్పినా కూడా డౌటా?

  • Gold Price: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions