AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు
- రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయి
- నిర్మాణ వ్యయం బిల్లులు అన్నీ ప్రజల ముందు పెడతా
- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించుకోవడం చేయలేదన్నారు. రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు.
Read Also: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
నిర్మాణ వ్యయం బిల్లులు అన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. టబ్ కోసం 36లక్షలు, కమోడ్ కోసం 12లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. 9.88ఎకరాల్లో ఏడు బ్లాకుల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించారని చెప్పారు. 13వేల 543చదరపు మీటర్ల నిర్మాణం జరిగిందన్నారు. అదిరిపోయే బిల్డింగ్లు నిర్మించి కొండను తొలిచేసి కొండ చరియలు విరిగిపడకుండా జపాన్ టెక్నాలజీ వాడారని వెల్లడించారు. వైట్ హౌస్, రాష్ట్ర పతి భవన్లో కూడా లేని కారిడార్లు నిర్మించారని చెప్పారు. చాలా దేశాలు తిరిగాను కానీ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎలా వచ్చిందా…అని ఆశ్చర్యం కలుగుతుందన్నారు. రుషికొండ మీద విచారణ చేస్తే చాలా మంది ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. జగన్ ఆంధ్రా ఎస్కో బార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం అంటే లెక్క లేకుండా వ్యవహరించారన్నారు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం 700కోట్లు పైగా ఖర్చు చేశారన్నారు. భోగ విలాసాల కోసం ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు.
Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..
రుషికొండ నిర్మాణాలపై చర్చ జరగాలని.. ప్రజలు కూడా దీనిపై అభిప్రాయం చెప్పొచ్చన్నారు. ఋషికొండను ఏం చెయ్యాలో తనకు అర్థం కావడం లేదన్నారు. రుషికొండలో ప్రజా ధనం దుర్వినియోగంపై వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. విశాఖ రాజధాని పేరుతో మభ్య పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పనులు చేసి ఎదురు దాడికి పాల్పడటానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజా కోర్టులో రుషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా రుషికొండ కాస్ట్లీ ఎఫైర్ అయ్యిందన్నారు. రుషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. రుషికొండ చర్చ అవసరం లేదు శిక్ష మిగిలింది.. అందులో ప్రభుత్వం వెయ్యాలిసింది.. ప్రజలు వెయ్యాలసినది మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రజా చైతన్యం కోసం పోలవరం చూపించాం.. ప్రజాస్వామ్యంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో చూడాలంటే రుషికొండ రావాలన్నారు. రుషికొండ నిర్మాణ, నిర్వహణ వ్యయం భారీగా ఉందన్నారు. తాను ఓపెన్ మైండ్తో ఉన్నానన్నారు. రుషికొండ దగ్గర పరిశీలన కోసం వచ్చిన వాళ్ళ పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?