CM Chandrababu: రహదారులపై ఫోకస్.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
- ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న రోడ్లపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సీఎం సమీక్ష సమావేశం..
- రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్న సీఎం..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న రోడ్లపై ఫోకస్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్నారు.. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున, ప్రజలు ఇబ్బంది పడకుండా.. ముందు గుంతలు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు సీఎం.. అయితే, గత ఐదేళ్లు కాలంగా రహదారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దాంతో.. రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయనే విమర్శలు లేకపోలేదు.. ఇక, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉందంటూ.. గతంలో.. టీడీపీ, జనసేన వివిధ సందర్భాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు కూడా నిర్వహించింది.. రోడ్లు దుస్థితిపై జనసేన సోషల్ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్ నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు జరిగే సమావేశంలో రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్డు.. తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Bharateeyudu 2: భారతీయుడు సీక్వెల్ అవసరమా అనుకున్నా: శంకర్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓవైపు సమీక్షా సమావేశాలు.. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. మొదట పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన.. సమీక్ష నిర్వహించి.. పనుల పురుగతి తెలుసుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు కోసం విదేశీ నిపుణులను రంగంలోకి దించారు.. మరోవైపు.. రాజధాని ప్రాంతంలో పర్యటించి.. భవనాల నిర్మాణ పనులు ఎక్కడికి వచ్చాయన్నదానిపై సమీక్ష నిర్వహించి.. అమరావతి పనుల్లో కదలిక తెచ్చారు.. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి.. వరాల జల్లు కురిపించారు.. మరోవైపు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీకి కూడా నిన్న మంగళగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో