CM Chandrababu: మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన
- స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
- ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అనంతరం కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రొద్దుటూరు రోడ్డులోని మున్సిపల్ కార్మికుల ఇంటి వద్దకు చేరుకుని.. ఇంటింటి చెత్త సేకరణ, తడి, పొడి, ఇతర వ్యర్ధాల నిర్వహణపై వివరాలు తెలుసుకుంటారు. రాయల కూడలి నుంచి సభావేదిక వరకు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర నినాదంతో ర్యాలీలో పాల్గొంటారు. ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో పురపాలకలోని వార్డు ప్రజలతో పాటు స్థానిక ప్రతినిధులతో కలిసి స్వచ్ఛాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంబించి ప్రజలతో చర్చిస్తారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
సీఎం చంద్రబాబు సాయంత్రం 4:30 నిమిషాలకు హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకుని 4:40 నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 4: 50 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 5:35లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసగృహానికి 6 గంటల 15 నిమిషాలకు సీఎం చేరుకుంటారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..