NTV Telugu Site icon

Chandrababu: ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసుకున్న ఏపీ సీఎం..

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులతో భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సీఎం చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల తరువాత సీఎం చంద్రబాబు ప్రజాభవన్ బయలుదేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు.

PM Modi: యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్‌మన్‌కి అభినందనలు తెలిపిన మోడీ..

సుదీర్ఘ కాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ తరుఫున చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ప్రజాభావన్లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగనుంది. సీఎంల మీటింగ్ అనంతరం డిన్నర్ ఉండనుంది.