CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
- సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
- రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఏచూరి ఒకరని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న శ్వాసకోశ వ్యాధులతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సీనియర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read Also: KCR: సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత సంతాపం..
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సీతారాం ఏచూరి ఒకరని చంద్రబాబు పేర్కొన్నారు. సమస్యలపై మేధోపరమైన అభిప్రాయాన్ని అట్టడుగు స్థాయిలో ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఏచూరి అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ఏచూరి స్పందించిన తీరు.. ఆయనకు పార్టీలకు అతీతంగా గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
సీతారాం ఏచూరి మృతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తమ సంతాపాన్ని తెలియజేశారు. సీపీఎం ప్రధానకార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(72) అకాల మృతి కమ్యునిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని.. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరుతెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. తుదిశ్వాస వరకు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన సీతారాం ఏచూరి మరణానికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రకటించారు.
Deeply saddened by veteran CPI-M leader, Sitaram Yechury Ji’s passing. He was a stalwart who rose from the ranks to become one of the most respected voices in Indian politics. He was known for his intellectual take on issues, and connection with the people at the grassroots… pic.twitter.com/0vL9Jq6ao5
— N Chandrababu Naidu (@ncbn) September 12, 2024
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!