CM Chandrababu: ఉచిత ఇసుక విధానం మరింత పారదర్శకంగా అమలు చేయాలి..
- విశాఖ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్ష
- నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదని ఆదేశం
- ఎక్కడైనా గుంతలు ఉంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక
- ఉచిత ఇసుక విధానం మరింత పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పంచ గ్రామాల సమస్యకు టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు. తాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు మార్చి నాటికి పూర్తి కావాలన్నారు. జిల్లాలోని జలశయాల సామర్ధ్యాలను గుర్తించి నీటి నిల్వ సామార్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోటళ్లు మరిన్ని రావాలి… అభివృద్ధి చేయాలి… గ్రే హౌండ్స్ భూములను హోటళ్లకు వినియోగించుకోవచ్చన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికి.. జిల్లాలోని అభివృద్ధి ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలన్నారు.
Read Also: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
శాంతిభద్రతల పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలి.. సీసీ కెమెరాల సంఖ్య పెంచాలి.. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాహనాల వేగాన్ని నియంత్రించాలి.. ప్రమాదాలను తగ్గించాలన్నారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానం పెరగాలన్నారు. సూర్యఘర్ పథకంలో భాగంగా రూప్ టాప్ సోలార్ ప్లాంటులు ఏర్పాటు చేయాలి.. ప్రజలను మరింత ప్రోత్సహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్, అపార్ ఆవశ్యకతను తెలపాలి.. ఫలాలు ఎక్కువ మందికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానం మరింత పారదర్శకంగా అమలు చేయాలన్నారు. అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.. పీపీపీ విధానాన్ని అనుసరించాలన్నారు.
సుగర్ ఫ్యాక్టరీల ద్వారా కేవలం పంచదార ఉత్పత్తి మాత్రమే కాకుండా.. ఇథనాల్, డిస్టిలరీ ఉత్పత్తిపై దృష్టి సారించాలి.. రైతులకు ప్రయోజనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలి… ఉపాధ్యాయులకు శిక్షణ.. భవనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టూరిజం అభివృద్ధికి ఊతం ఇస్తూ… గిరిజన యువతను గైడ్లుగా మార్చాలి.. తగిన శిక్షణ ఇప్పించాలన్నారు. ఏజెన్సీల్లో డోలీమోత సమస్యకు చెక్ పెట్టాలన్నారు. ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నారు. అభివృద్ధి విషయంలో… పరిపాలన వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!