CID Chief Sanjay: అందుకే చంద్రబాబు అరెస్ట్.. కీలక అంశాలు వెల్లడించిన సీఐడీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CID Chief Sanjay: స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక అంశాలను బయటపెట్టారు సీఐడీ చీఫ్ సంజయ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్తాయి.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తి సంబధం ఉంది కాబట్టే అరెస్టు చేశాం అన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తికే చాలా పదవులు ఇవ్వడంతోపాటు కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఆయన.. టీడీపీకి చెందిన జే. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్ గా నియమించారు.. ఈ వ్యవహారంలో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారు.. జీవోలో 90 – 10 శాతం వాటాలను పేర్కొన్నారు.. కానీ, ఒప్పందంలో లేదన్నారు.
ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అన్నారు సీఐడీ చీఫ్.. సేమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ కూడా 164 స్టేట్ మెంట్ ఇచ్చారు అని తెలిపారు. 58 కోట్లు మాత్రమే మాకు వచ్చాయని సిమెన్స్ సంస్థ పేర్కొంది.. 241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లిపోయినట్టు వివరించారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారు.. ఇక్కడ నేరం లో ఇమిడి ఉన్న డబ్బు 241 కోట్ల రూపాయలు అన్నారు. డిజైన్ టెక్ ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి.. 58 కోట్లతో కొనుగోలు చేసి 2800 కోట్లుగా చూపించారు.. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయి.. కానీ, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి.. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో 2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు.. డిజైన్ టెక్ కు చెందిన 32 కోట్లు ఈడీ సీజ్ చేసిందని తెలిపారు.. ఇక, మీడియాతో మాట్లాడిన సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించిన కీలక అంశాలు తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!