AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు కేబినెట్ ఆమోదం
- ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
- ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రిఫిల్ బిల్లును కూడా ఆమోదించిన కేబినెట్
- 2014-18 మధ్య నీరు.. చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లింపులు.. పనులు ప్రారంభానికి ఆమోదం
- ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను ఆమోదించిన మంత్రి మండలి
- ఏపీ ఎక్సైజ్ చట్టం సవరణ ముసాయిదాకు కేబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల చెల్లింపులు: 2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య పూర్తి అయిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొటెక్షన్ బిల్ 2024: 1982 లో వచ్చిన “ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్” స్థానంలో 2024 లో కొత్త ముసాయిదా బిల్ను ప్రవేశపెట్టడం కేబినెట్ ఆమోదించింది.
ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 సవరణ: జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ 2024 నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది.
ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్ 2024: ఈ సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024: కేబినెట్ ఆమోదించిన మరో కీలక నిర్ణయం. దీనిలో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024 కు కూడా ఆమోదం ఇచ్చారు.
స్పెషలైజ్డ్ డెవలప్మెంట్ అథారిటీలు: కుప్పం , పిఠాపురం ప్రాంతాలలో ఎరియా డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసేందుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ నాలుగు మండలాలను, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ స్థాపించబడింది.
సీఆర్డీఏ పరిధి విస్తరణ: సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లా 92 గ్రామాలు, బాపట్ల జిల్లా 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి చేర్చేలా కేబినెట్ నిర్ణయించింది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిస్బర్సల్: 2024-25 విద్యా సంవత్సరంలో నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయడం సాధ్యం అవుతుంది.
అదనపు నిర్ణయాలు: 2024 జూన్ 24 నుండి అక్టోబర్ 23 వరకు తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా చర్చ జరిగింది.
ఈ కీలక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా రంగం తదితర విషయాల్లో దిశా నిర్దేశం చేయడం జరిగినది.
తాజావార్తలు
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?