AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’
- మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు
- వీలైనంత వరకు వర్చువల్ విధానంలో సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు చర్యల అమలులో కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ, ఇంధన పొదుపు, వాహన వినియోగం తగ్గింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠినమైన పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు చర్యలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజల్లో ఇంధన పొదుపు, విద్యుత్ వినియోగ నియంత్రణ, ఖర్చుల తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇకపై కొంతకాలం పాటు మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేయాలనే ఆలోచనపై కూడా చర్చ జరిగింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా అత్యవసరమైన పర్యటనలు మినహా విదేశీ టూర్లను పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రోజు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఉపయోగించాలని సూచించింది. ముఖ్యంగా మంత్రులు, అధికారులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
మంత్రులు జిల్లాల పర్యటనల సమయంలో కూడా కాస్ట్ కటింగ్ చర్యలు పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరం లేని ఆర్భాటాలు, అధిక వాహన వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మంత్రుల నుంచి అధికారుల వరకు అందరూ వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కార్యాలయాల్లో భౌతిక హాజరు అవసరం లేని ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అవకాశం కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతలను 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులను తగ్గించాలని, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంధన, పొదుపు సూచనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టడం రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!