AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
- ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర
- రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
‘రాష్ట్ర ఆర్థిక పురోగతికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఏఐ డెవలప్మెంట్కి దోహదపడే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని కేబినెట్లో ఆమోదించడం జరిగింది. పెట్టుబడి దారులకి ఒక డెస్టినేషన్ ఉండేలా కేబినేట్ జరిగింది. దేశంలో నెంబర్ 1 దిశలో తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిపించే విధంగా ప్రభుత్వం ముందుకి వెళ్తుంది. రిలయన్స్ కన్స్యూమర్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ ఫ్యాక్టరీ, వాటి పెట్టుబడులకి, భూకేటాయింపునకి కేబినేట్ ఆమోదం తెలిపింది. చిత్తూర్ జిల్లాలో సోయా ఫ్యాక్టరీకి కేబినేట్ ఆమోదించింది. కర్నూలులో మష్రూమ్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని అభివృద్ధి చేసేందుకు కేబినేట్ ఆమోదం. మన రాష్ట్రంలో వీటి ఉత్పత్తికి అనుకూలంగా ఉండనుంది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
Also Read: AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
‘టూరిజం అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న వనరులని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో స్టార్ హోటల్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదం తెలిపింది. అరకు వ్యాలీ, అమరావతి ఇలా టూరిజం ప్రాంతాలలో స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది. సాఫ్ట్వేర్ రంగంలో కీలక పాత్ర వహించనున్న రైడన్ ఇన్ఫోటిక్ డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు, విశాఖలోని మూడు ప్రాంతాలలో అతి పెద్ద డేటా సెంటర్స్ కి సంబంధించి భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో మరికొన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉండనుంది. సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే రెవెన్యూ వచ్చే మార్గాలను చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ సంస్థ ఏర్పాటుకి కాబినేట్ ఆమోదం తెలిపింది. అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటిక్ కాంపౌనెంట్ సంస్థ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది’ అని మంత్రి పార్థసారథి చెప్పుకోచ్చారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..