సీఎం చంద్రబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా కేంద్రం మారిన నేపథ్యంలో.. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మండిపల్లితో సీఎం చెప్పారు. రాయచోటి అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రాయచోటిని అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని మంత్రి మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. ఈరోజు…
రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే తాను చాలా బాధపడ్డాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందని మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన పొరపాటు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినే అంటూ.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన ప్రతీ కన్నీటిబొట్టు రాయచోటి అభివృద్ధికే ఉపయోగపడుతుందని మంత్రి రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై కన్నీరు…
ఏపీ క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి చర్చ జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చడం అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాబినెట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు ఆయన్ను ఓదార్చారు. క్యాబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మారుస్తున్నాం అని, రాజంపేటను కడప జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో కలిసి అనగాని మీడియాకు…
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.…
ఏపీ కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగా ప్రచారం చేయలేకపోయాం అని ఫైర్ అయ్యారు. యూనిట్కు 13 పైసలు తగ్గించినా.. మనం జనాలకు చెప్పుకోలేకపోయారంటూ విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు ఇచ్చారు.…