NIA RAids: 3 రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ సానుభూతిపరులే లక్ష్యంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA RAids: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 2022 అక్టోబర్లో కోయంబత్తూరులో జరిగిన పేలుళ్లలో జమేజా ముబిన్ మరణించారు. 2019లో ఐఎస్ఐఎస్ సంబంధాలపై కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ముబిన్ రెండు ఓపెన్ సిలిండర్లతో కారు నడుపుతుండగా, వాటిలో ఒకటి గత ఏడాది అక్టోబర్లో పేలిపోయిందని పోలీసులు తెలిపారు. అతని ఇంటిని వెతికిన తర్వాత తక్కువ-ఇంటెన్సివ్ పేలుడు పదార్థం రికవరీ అయింది. అవి భవిష్యత్తు ప్రణాళికలు కోసం ఉద్దేశించినవిగా అనిపించాయని తమిళనాడు పోలీసు చీఫ్ సి.శైలేంద్ర బాబు అన్నారు.
నవంబర్ 19న మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటనపై డిసెంబర్లో ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్లో కర్ణాటకలోని మంగళూరులో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. మహ్మద్ షరీఖ్ అనే వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తుండగా ఐఈడీ బాంబుతో ఉన్న ప్రెజర్ కుక్కర్ పేలి డ్రైవర్తో పాటు నిందితుడికి కూడా గాయాలయ్యాయి. మొదటగా దీన్ని సాధారణ ప్రమాదంగా అందరూ భావించినా,.. తర్వాత కర్నాటక డీజీపీ దీన్ని ‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’ అని ప్రకటించడంతో ఇది ఉగ్రవాద చర్యగా తెలిసింది. ఈ ఘటనపై కర్నాటక పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు జరుపుతుందని డీజీపీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
Also Read
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
- Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
- Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?
అయితే ఇందులో బాంబును తీసుకెళుతున్న మహ్మద్ షరీఖ్ ఇంతకుముందే దేశద్రోహ చట్టం క్రింద అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకొచ్చాడని పోలీసులు గుర్తించారు. మహ్మద్ షరీఖ్ పై గతంలో దేశద్రోహచట్టంతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కర్ణాటకలోని షిమోగా జిల్లాలో వీర్ సావర్కర్ పోస్టర్ను ప్రదర్శించిన వ్యక్తిని కత్తితో పొడిచిన కేసులో కూడా మొహమ్మద్ షరీఖ్ నిందితుడేనని ప్రాథమిక సమాచారంలో తెలిసింది. దక్షిణ భారతదేశంలో ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యూల్ను స్థాపించాలనే ఉద్దేశ్యంతో షరీఖ్ నవంబర్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలోని అటవీ ప్రాంతాలను సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?