NIA RAids: 3 రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ సానుభూతిపరులే లక్ష్యంగా..
NIA RAids: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 2022 అక్టోబర్లో కోయంబత్తూరులో జరిగిన పేలుళ్లలో జమేజా ముబిన్ మరణించారు. 2019లో ఐఎస్ఐఎస్ సంబంధాలపై కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ముబిన్ రెండు ఓపెన్ సిలిండర్లతో కారు నడుపుతుండగా, వాటిలో ఒకటి గత ఏడాది అక్టోబర్లో పేలిపోయిందని పోలీసులు తెలిపారు. అతని ఇంటిని వెతికిన తర్వాత తక్కువ-ఇంటెన్సివ్ పేలుడు పదార్థం రికవరీ అయింది. అవి భవిష్యత్తు ప్రణాళికలు కోసం ఉద్దేశించినవిగా అనిపించాయని తమిళనాడు పోలీసు చీఫ్ సి.శైలేంద్ర బాబు అన్నారు.
నవంబర్ 19న మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటనపై డిసెంబర్లో ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్లో కర్ణాటకలోని మంగళూరులో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. మహ్మద్ షరీఖ్ అనే వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తుండగా ఐఈడీ బాంబుతో ఉన్న ప్రెజర్ కుక్కర్ పేలి డ్రైవర్తో పాటు నిందితుడికి కూడా గాయాలయ్యాయి. మొదటగా దీన్ని సాధారణ ప్రమాదంగా అందరూ భావించినా,.. తర్వాత కర్నాటక డీజీపీ దీన్ని ‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’ అని ప్రకటించడంతో ఇది ఉగ్రవాద చర్యగా తెలిసింది. ఈ ఘటనపై కర్నాటక పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు జరుపుతుందని డీజీపీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?
అయితే ఇందులో బాంబును తీసుకెళుతున్న మహ్మద్ షరీఖ్ ఇంతకుముందే దేశద్రోహ చట్టం క్రింద అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకొచ్చాడని పోలీసులు గుర్తించారు. మహ్మద్ షరీఖ్ పై గతంలో దేశద్రోహచట్టంతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కర్ణాటకలోని షిమోగా జిల్లాలో వీర్ సావర్కర్ పోస్టర్ను ప్రదర్శించిన వ్యక్తిని కత్తితో పొడిచిన కేసులో కూడా మొహమ్మద్ షరీఖ్ నిందితుడేనని ప్రాథమిక సమాచారంలో తెలిసింది. దక్షిణ భారతదేశంలో ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యూల్ను స్థాపించాలనే ఉద్దేశ్యంతో షరీఖ్ నవంబర్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలోని అటవీ ప్రాంతాలను సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!