Chhattisgarh: భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
- ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్
- 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
- మరికొందరు మావోయిస్టులు, జవాన్లకు గాయాలు
- బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్కౌంటర్
- డీఆర్జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయ్యాలయ్యాయి. గాయపడిన ఇద్దరు సైనికులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read Also: TECNO Phantom V Flip 5G: క్రేజీ డీల్.. రూ. 72 వేల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రూ. 26 వేలకే
Also Read
ఎన్కౌంటర్ స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఒక ఏకే 47, ఒక SLR, ఇస్తాఫ్ రిఫైల్, 303 BPL లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. అదనపు బలగాలతో ఆ ప్రాంతమంతా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా.. ఈ విషయాన్ని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ పీ ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు చనిపోయి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ఏకే 47లు దొరకడంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జరిగిన ఎన్కౌంటర్లలో 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!