Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Another Jolt To India Bloc Arvind Kejriwals Aap To Contest Bihar Assembly Polls

AAM Admi Party: ఇండియా కూటమికి షాక్‌.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్‌

Published Date :August 27, 2023 , 7:09 pm
By Mahesh Jakki
AAM Admi Party:  ఇండియా కూటమికి షాక్‌.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

AAM Admi Party: ఇండియా కూటమికి మరో షాక్‌ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది. ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ దేశ రాజధానిలో బీహార్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బీహార్‌లో పార్టీని బలోపేతం చేయాలని సందీప్ పాఠక్ ఉద్ఘాటించారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే, బీహార్ ఇన్‌ఛార్జ్ అజేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

“మురికి రాజకీయాల కారణంగా రాష్ట్రం ముందుకు సాగకపోవటం బీహార్ దురదృష్టం. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండటం తప్పనిసరి.” అని ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ చెప్పారు. పార్టీని విస్తరించేందుకు ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయాలని బీహార్‌లోని పార్టీ నాయకులను పాఠక్ కోరారు. ‘‘బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తాం. కానీ ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. బీహార్‌లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేం, అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సొంతంగా కమిటీ వేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఇప్పటినుంచే కష్టపడండి. ఒకసారి పార్టీ బలంగా మారితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాము, ”అని సందీప్ పాఠక్ జోడించారు.

Also Read

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..
  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

Read Also: B20 Summit: భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోంది.. బీ20 సమ్మిట్‌లో ప్రధాని

ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన పార్టీ అవసరమని ఉద్ఘాటించిన పాఠక్.. గుజరాత్‌లో మాదిరిగానే బీహార్‌లో కూడా ఆప్ పూర్తి శక్తితో ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పారు. తన ప్రణాళికల గురించి పాఠక్ మాట్లాడుతూ, పార్టీ మొదట స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, గత తొమ్మిదేళ్లలో ప్రసంగాలు తప్ప ప్రధాని మోదీకి సమాధానాలు లేవని అన్నారు. ఇండియా కూటమి గురించి అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చని, దేశమే తమకు ముఖ్యమన్నారు. ఆప్‌ జాతీయ పార్టీ అని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఆయన.. పొత్తులపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆప్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ స్పందించారు. ఆప్‌ను బీహార్‌కు ఆహ్వానించిన వారికి ఈ చర్య ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. “బీహార్‌లో 40 సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు ఎన్డీయే గెలుస్తుంది. బీహార్‌లో AAP లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వారిని బీహార్‌కు ఆహ్వానించిన వారికి ఇది సమస్యాత్మకం.” అని షానవాజ్ హుస్సేన్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • AAP
  • Arvind Kejriwal
  • Bihar Assembly polls
  • INDIA Bloc

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions