Telangana: తెలంగాణలో రూ.2800 కోట్లతో మరో భారీ పెట్టుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించనుండటంతో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు జరుతున్నాయి. మరికొన్ని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయులు చేసుకుంటున్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ అనుకూలమని ఆయా సంస్థలు రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల విదేశీ పర్యటనతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహద పడుతున్నాయి.
Read Also: Govt Warning: అసభ్య పోస్టులను ఉపేక్షించం.. ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు కేంద్రం హెచ్చరిక
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
అయితే, తెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ రావడానికి రెడీ అయింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్టెక్ కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్లో పోస్టు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంవోయూ కుదుర్చుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Read Also: Maharashtra: రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. తప్పిన పెను ప్రమాదం..
ఇక, తెలంగాణలో అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కెయిన్స్టెక్ సంస్థ వెల్లడించింది. కెయిన్స్ టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రంలో పెట్టుపడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కెయిన్స్టెక్ కంపెనీని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఫాక్స్ కాన్, కార్నింగ్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థల తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
-
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
-
PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?