Crime News: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా , పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నా రు కామాంధులు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్గంజ్లో ఇద్దరు బాలికలపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. బాలికలు ఉత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేశామని, వారిపై కేసు నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
అంతకుముందు మార్చి 5న అలీఘర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వివరాలను పంచుకుంటూ అలీఘర్ ఎస్పీ (నగరం), కుల్దీప్ సింగ్ గుణవత్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల బాలిక మార్చి 3న తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తన గ్రామానికి చెందిన ఐదుగురిపై మార్చి 4న ఫిర్యాదు చేసిందన్నారు. “ఆమె ఫిర్యాదుపై చర్య తీసుకున్న మేము వెంటనే ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపాము. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది” అని గుణవత్ తెలిపారు. మార్చి 3న ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
Read Also: Dog Attack : మరో చిన్నారిని బలి తీసుకున్న కుక్కలు
బాధితురాలు తన తల్లి ఇంటికి వెళ్లి ఇంటికి వెళ్తుండగా నిందితులు ఆమెను అడ్డగించారని అధికారులు తెలిపారు. నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఆమెను కనుగొని, నిందితులు ముగ్గురూ ఆమెను ఇంటికి వదిలివేసేందుకు ముందుకొచ్చారని, ఆమె నిరాకరించడంతో, నిందితులు ఆమెను ఏకాంత ప్రదేశానికి లాగి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!