Anil Kumar Yadav: ఏపీలో సుపరిపాలన జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సాధికార బస్సు యాత్రలో నల్ల జెండాలు ప్రదర్శించాలని పప్పుగాడు (నారా లోకేష్ ) అంటున్నారు.. గత ఐదు రోజులుగా చూస్తున్నా.. ఎవరైనా వస్తారని.. అలా వస్తే తొక్కుకుంటూ వెళ్తాం అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
Read Also: Samajika Sadikara Bus Yatra: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్
Also Read
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలపై ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని 175 స్థానాల్లో గెలిపించాలి.. 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేసి.. టీడీపీ, జనసేన పార్టీలను బొంద పెట్టాలి అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?