Andhrapradesh: కరోనా అలర్ట్.. కొత్త వేరియంట్తో అధికారులు అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 656 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కొత్త కరోనా వేరియంట్ కట్టడికి వైద్యులు చర్యలు చేపడుతున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జీజీహెచ్లో వెంటిలేటర్స్తో కూడి 30 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ప్రత్యేకంగా కరోనా క్వారంటైన్ వార్డును ఏర్పాటు చేశారు.
Read Also: Prudhviraj on AP Politics: ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో యుద్ధ ప్రాతిపదికన కరోనా సహాయక సన్నాహాలు ప్రారంభించారు. జేఎన్-1 కరోనా కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో కేసులు నమోదు కాకపోయినా అనధికారికంగా కొన్ని కరోనా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎవరికి వారు హోం ఐసోలేషన్, సొంత వైద్యంతోనే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు గుర్తించారు. కరోనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ హాస్పిటల్లో 1500 ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయి. జీజీహెచ్లో ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్తో పోల్చుకుంటే జేఎన్-1 ప్రభావం తక్కువగానే ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అశ్రద్ధ చేయొద్దని, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!