NTV Telugu Site icon

Andhrapradesh: ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు.. అధికారులను అభినందించిన సీఎం

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి అవార్డు వివరాలను ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also: Janasena Leaders Joins YSRCP: జనసేనకు షాక్‌.. వైసీపీలో చేరిన కీలక నేతలు

ఇటీవల న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అధికారులు అవార్డును అందుకున్నారు. వరుసగా రెండేళ్ళలో రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకుని ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబు,ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బీఏవీపీ కుమారరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.