TTD Parakamani Theft Case: పరకామణి కేసులో కీలక పరిణామం.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు..
- టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి హైకోర్టు కీలక సూచనలు..
- కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా..
- విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం..
- ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచన..
TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి కీలక సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న ఏపీ హైకోర్టు.. ఈ కేసులో సీఐడీ ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.. కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా.. విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
Read Also: Cancer Research: కప్ప ప్రేగులోని బాక్టీరియాతో క్యాన్సర్కు చెక్..! ఎలుకలపై ప్రయోగం సక్సెస్..
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కీలక విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై CID ఇప్పటికే దర్యాప్తు నివేదికను సమర్పించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. కోర్టు CID నివేదికను పరిశీలించిన అనంతరం, కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ఈ కేసులో వేర్వేరు కోణాలు, విభిన్న ఆరోపణలు ఉన్నందున, వాటిని విడివిడిగా పరిశీలించి.. అవసరమైతే ప్రత్యేకంగా FIRలు నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులోని భిన్న అంశాలపై విడిగా FIR నమోదు చేసే అవకాశాన్ని పరిశీలించాలి అని CIDకి సూచించింది.. ప్రస్తుత దర్యాప్తు సరైన దిశలో ఉన్నా.. ఇంకా పూర్తిస్థాయి విచారణ అవసరం అని పేర్కొంది.. ఆస్తుల లావాదేవీలతో పాటు ఇతర సంబంధిత అంశాలను లోతుగా పరిశీలించాలి ఆదేశించింది.. ఈ ట్విస్ట్లతో TTD పరకామణి కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు నివేదికలు, FIR నమోదు ప్రక్రియలు తదుపరి విచారణలో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!