Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Jessie: ఆంధ్రప్రదేశ్లోని ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థిని.. ఈ రోజు ప్రపంచ స్థాయి అంతరిక్ష పరిశోధన వైపు ముందడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPGHS)లో చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ అయిన ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShakthiSAT)కు ఎంపికై వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు పోటీ పడగా, భారత్ నుంచి ఎంపికైన కేవలం 20 మంది విద్యార్థినుల్లో జెస్సీ ఒకరిగా నిలవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా రికార్డు సృష్టించింది.
పాఠశాల ప్రయోగశాలలో చిగురించిన ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఆమె ఫిజికల్ సైన్స్ టీచర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ మణిమాల కృషి ఎంతగానో ఉంది. సైన్స్ పట్ల జెస్సీకున్న తీవ్ర ఆసక్తిని, జిజ్ఞాసను గమనించిన మణిమాల, గతేడాది ఆమెను ఈ ప్రోగ్రామ్లో నమోదు చేయించారు. పదో తరగతి సాధారణ సిలబస్కు ఎంతగానో భిన్నంగా ఉన్న ఈ కోర్సువర్క్ ఏమాత్రం సులభంగా సాగలేదు. ఇందులో శాటిలైట్ సిస్టమ్స్, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి సంక్లిష్టమైన అంశాలపై 21 మోడ్యూళ్ల ద్వారా దాదాపు 550 ఆన్లైన్ సెషన్లు ఉన్నాయి. స్కూల్ పాఠాల కంటే ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉండటంతో ప్రారంభంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, జెస్సీ ప్రతిరోజూ స్కూల్ పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ తన పట్టుదలను నిలుపుకుంది.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
ఈ సుదీర్ఘ అభ్యాసం తర్వాత జరిగిన ఆఖరి ఎంపిక ప్రక్రియ జెస్సీ జీవితాన్నే మలుపు తిప్పింది. శాస్త్రవేత్తలు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లతో జరిగిన గంటసేపటి ఆన్లైన్ ఇంటర్వ్యూతో పాటు, మిషన్ శక్తిశాట్ ప్రాముఖ్యత, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక నిమిషం నిడివిగల వీడియోను రూపొందించాల్సి వచ్చింది. వీటిన్నింటిలోనూ తన ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్న జెస్సీ, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వేలాది మంది గ్రామీణ విద్యార్థినులకు ఆదర్శంగా నిలిచింది.
తాజావార్తలు
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!