AP Governance: సుపరిపాలనలో తొలి అడుగు.. నేడు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Governance: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ గా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి.. అలాగే రాబోయే రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. నేడు (జూన్ 23) సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో సమావేశం జరుగనుంది. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండేది. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
Read Also: Tirumala Darshanam: నేడు సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లు విడుదల..!
ప్రభుత్వ పాలనలో గత ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టనుంది. అలాగే వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనా దృష్టి పెట్టనున్నారు.
వేదిక పై వివిధ శాఖల పనితీరు పై సీఎం చంద్రబాబు ప్రశ్నలు.. మంత్రుల సమాధానాలు ఉండనున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు – పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన తదితర అంశాల పై సీఎం చంద్రబాబు ప్రసంగం ఇవ్వనున్నారు. గత ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు, రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే పేరిట ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఏం చెయ్యాలి..? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి..? అనే అంశాల పై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, మంత్రులకు సమావేశం ముగిసిన తరువాత వారితో సీఎం చంద్రబాబు డిన్నర్ చేయనున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..