Liger : లైగర్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆనంద్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైగర్.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి లో విడుదలైంది లైగర్ సినిమా.ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, మరియు నిర్మాత చార్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అస్సలు బయటకు రాలేదు.సినిమా తీవ్రంగా విఫలం కావడంతో ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ ఆందోళన చేసారు.మేము భారీగా నష్టపోయామని మాకు నష్టపరిహారం చెల్లించాలి అని సినిమా విడుదలైన తర్వాత పూరి జగన్నాథ్ పై వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకుని వచ్చారు.ఆ సమయంలో పూరి జగన్నాధ్ ఏదోరకంగా వారికీ సర్ది చెప్పుకుంటూ వచ్చారు.. కానీ ఆ వివాదం అంతటితో ముగియలేదు. ఇటీవల మరోసారి డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా బేబీ.ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ లైగర్ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు.విజయ్ అన్న డైలాగ్ డెలివరీ అలాగే తన వాయిస్ ను ఇష్టపడే వారు చాలా మంది వున్నారు.పెళ్లిచూపులు సినిమా నుంచి ఒక డిఫరెంట్ వాయిస్ తెలుగు ఇండస్ట్రీలో వినిపించింది. ఆ వాయిస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది.అలాంటి వాయిస్ వున్న విజయ్ అన్నతో నత్తితో మాట్లాడించడం అనేది లైగర్ సినిమాకి మైనస్ అయింది.ప్రాపర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుంటే సినిమా కొత్తగా ఉండేది అని తన అభిప్రాయాన్ని తెలిపారు ఆనంద్ దేవరకొండ. లైగర్ సినిమా కోసం తన అన్నయ్య విజయ్ దేవరకొండ రెండేళ్లు ఎంతో కష్టపడ్డాడని ఆనంద్ తెలిపారు. బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
Also Read
- కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
తాజావార్తలు
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!