Anam Ramanarayana Reddy: ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు
- ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు
- ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవదాయ శాఖ ఇప్పించే ప్రయత్నం చేస్తాం
- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణరెడ్డి
- నేటి నుంచి పూర్తిగా శాఖ పైన అన్ని రకాల చర్యలు.. నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Ramanarayana Reddy: ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటాం.. ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవదాయ శాఖ ఇప్పించే విధంగా చర్యలు చేపడతాం అన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయ.. ఏపీ ప్రభుత్వ దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు.. ఇక, నేటి నుంచి పూర్తిగా శాఖ పైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.. మంత్రి బాధ్యతల స్వీకరణకు అనేక ప్రాంతాల నుంచి ఆలయ పాలకవర్గ అధికారులు వచ్చారు.
Read Also: Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఇక, 3వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తమ కార్యాలయంలో పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి ఆనం.. ధర్మాన్ని మనం కాపాడితే.. అదే మనల్ని, ప్రజల్ని కాపాడుతుందన్న ఆయన.. ఆలయాల నిర్వహణ పట్ల గతంలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం సరిచేసుకొని వెళ్లాలి.. మొదటిసారి జరిగితే దాన్ని తప్ప రెండోసారి జరిగిన స్వయంకృత అపరాధం కింద పరిగణిస్తాం న్నారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నాము.. తమ అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచారు.. త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరాను.. అందరూ పీఠాధిపతులు, మతాధిపతులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు.. 26 వేలకు పైగా ఆలయాలకు పాలకవర్గాలు, ఆస్తులు ఉన్నాయి.. కానీ, దీపం పెట్టే పరిస్థితి లేదన్నారు. ధూప దీప నైవేధ్యం కోసం కార్యక్రమం తీసుకుంటామన్నారు.. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి.. అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తాం అన్నారు.
Read Also: Kishan Reddy: నితిన్ గడ్కరితో కిషన్ రెడ్డి సమావేశం.. ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చ
దేవాలయాల అభివృద్ధి పునరుద్ధరణ వంటి విషయాలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తరువాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు ఆనం రామనారాయణరెడ్డి.. ఆలయాల కమిటీ కాలపరిమితి ప్రకారం కొత్త వాటి నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.. తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈవోగా శ్యామలరావును నియమించారు.. అన్ని ఆలయాల్లో పవిత్రత నిలబడేలా, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని కాపాడటమే దేవాదాయశాఖ బాధ్యత.. న్యాయస్థానం, చట్టపరిధిలో ఉన్న స్థల ఆక్రమణ విడుదలకు చర్యలు చేపడతాం.. ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!