Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amravati: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడు తెల్లవారుజామున సుమారు 3:15 నుంచి 3:30 గంటల మధ్య ఆసుపత్రి మూడో అంతస్తులోని NICUలో ఈ ప్రమాదం జరిగింది. NICUలోని వెంటిలేటర్లో పేలుడు సంభవించిన అనంతరం మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే శిశువులను NICU నుంచి తరలించడంతో పలువురి ప్రాణాలను కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు శిశువులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం NICUలోని ఒక వెంటిలేటర్లో పేలుడు సంభవించిన తర్వాత మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. NICUలో మూడు విభాగాలు ఉండగా.. ఒక్కో విభాగంలో 13 మంది శిశువులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది.
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ఈ ఘటనపై NCP నాయకురాలు సుప్రియా సూలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శిశువుల కోసం తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారని, అలాంటి సమయంలో తమ బిడ్డను ఈ విధంగా కోల్పోవడం వారి కుటుంబాలకు ఊహించలేని విషాదమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ప్రమాదంగా చూడకుండా.. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
#Maharashtra के अमरावती में जिला महिला अस्पताल के बेबी वार्ड में आग लगने से 3 नवजात बच्चों की मौत हो गई है..आज तड़के 3:30 बजे अचानक एक वेंटिलेटर में विस्फोट होने के बाद आग लगी..इस NICU में 39 नवजात बच्चों को रखा गया था..@TNNavbharat @AmtCityPolice pic.twitter.com/meH2Mrmh1p
— Atul singh (@atuljmd123) August 24, 2026
తాజావార్తలు
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క