Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..
- సోమవారం తెల్లవారుజామున 3:15 నుంచి 3:30 గంటల మధ్య NICUలో మంటలు
- NICUలోని వెంటిలేటర్లో పేలుడు..
- ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amravati: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడు తెల్లవారుజామున సుమారు 3:15 నుంచి 3:30 గంటల మధ్య ఆసుపత్రి మూడో అంతస్తులోని NICUలో ఈ ప్రమాదం జరిగింది. NICUలోని వెంటిలేటర్లో పేలుడు సంభవించిన అనంతరం మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే శిశువులను NICU నుంచి తరలించడంతో పలువురి ప్రాణాలను కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు శిశువులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం NICUలోని ఒక వెంటిలేటర్లో పేలుడు సంభవించిన తర్వాత మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. NICUలో మూడు విభాగాలు ఉండగా.. ఒక్కో విభాగంలో 13 మంది శిశువులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఈ ఘటనపై NCP నాయకురాలు సుప్రియా సూలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శిశువుల కోసం తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారని, అలాంటి సమయంలో తమ బిడ్డను ఈ విధంగా కోల్పోవడం వారి కుటుంబాలకు ఊహించలేని విషాదమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ప్రమాదంగా చూడకుండా.. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
#Maharashtra के अमरावती में जिला महिला अस्पताल के बेबी वार्ड में आग लगने से 3 नवजात बच्चों की मौत हो गई है..आज तड़के 3:30 बजे अचानक एक वेंटिलेटर में विस्फोट होने के बाद आग लगी..इस NICU में 39 नवजात बच्चों को रखा गया था..@TNNavbharat @AmtCityPolice pic.twitter.com/meH2Mrmh1p
— Atul singh (@atuljmd123) August 24, 2026
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?