టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గుంటూరు కారం’.అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడం తో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..
ఇప్పటికే ఈ సినిమా నుంచి ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి మరియు ఓహ్ మై బేబీ, సాంగ్ లు విడుదల చేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘అమ్మ’అనే ఎమోషనల్ సాంగ్ను విడుదల చేశారు. పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు..ఈ మూవీ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లు గా నటించారు.సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మహేష్ తల్లి పాత్రలో నటించారు.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించాడు.థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ త్వరలోనే ఈ మూవీకి ఓటీటీ లో రిలీజ్ కానుంది.