Amit Shah On Reservations: రిజర్వేషన్లను తొలగిస్తామనేది పచ్చి అబద్దం.. మాకు 400 సీట్లు పక్కా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: 2024 లోక్సభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ పూర్తైంది. ఇప్పుడు మూడో దశ ఓటింగ్ మే 7వ తేదీన జరగనుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అస్సాంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు నిరాధారమని అన్నారు. ఈ రెండు దశల తర్వాత, మా పార్టీ అంతర్గత అంచనా ప్రకారం.. బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 100 స్థానాలను దక్కించుకున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులతో 400 సీట్లు దాటాలనే మా లక్ష్యం వైపు దూసుకుపోతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
Read Also: Himachal Pradesh : హిమాచల్లో వర్షం, హిమపాతం.. రోడ్డుపై నిలిచి పోయిన వేలాది వాహనాలు
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అమిత్ షా అన్నారు. SC,ST, OBCలకు రిజర్వేషన్లు ఉండటానికి బీజేపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు.. దాని కారణంగా OBC రిజర్వేషన్లు తగ్గించబడ్డాయి.. ఆ తర్వాత కర్ణాటకలో రాత్రికి రాత్రే ఎలాంటి సర్వే లేకుండానే ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో పెట్టి వారికి 4 శాతం రిజర్వేషన్ కోటాను కేటాయించడం వల్ల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో కూడా కోత విధించబడిందని అమిత్ షా వెల్లడించారు.
Read Also: TS SSC Results 2024: టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇక, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మొదలైన అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విజయం సాధిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీంతో పాటు సౌత్ ఇండియాలో కూడా బీజేపీకి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. 400 సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ కొద్ది రోజుల నుంచి అసత్య ఆరోపణలు చేస్తుందని అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!