PM Modi: జమ్మూకాశ్మీర్ పరిస్థితులపై మోడీ సమీక్ష
- జమ్మూకాశ్మీర్ పరిస్థితులపై మోడీ సమీక్ష
- నాలుగు రోజుల్లో 4 ఉగ్రదాడులు
- ఉగ్ర నిరోధక సామర్థ్యాలను దించలని ఆదేశం
కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాడ్డక జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, జమ్మూ-కశ్మీర్ ఎల్జీ మనోజ్సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Drinking Tea: టీ ఎక్కువగా తాగేస్తున్నారా.. ఈ సమస్యలతో సతమతమవ్వాల్సిందే..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ-కశ్మీర్లోని పర్యటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మంగళవారం సాయంత్రం కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్పోస్టుపై మంగళవారం జరిగిన దాడిలో.. రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు.
ఇది కూడా చదవండి: Puri Jagannath Temple: తెరుచుకున్న జగన్నాధుడి ద్వారాలు.. ఆనందంలో భక్తులు..
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని డీజీపీ ఆర్ఆర్ స్వైన్ ఆరోపించారు. శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు పశ్చాత్తాపపడతారని.. పాకిస్థానీ ఉగ్రవాదుల మాదిరి కాకుండా.. వారికి ఇక్కడ కుటుంబాలు, స్థలాలు, ఉద్యోగాలు ఉన్నాయని ‘శత్రువు ఏజెంట్ల’ను ఉద్దేశించి హెచ్చరించారు. రియాసీ జిల్లాలో భద్రత పరిస్థితులపై డీజీపీ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసైనికులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!