AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించడాన్ని ప్రశంసిస్తూ ఏపీ జేఏసీ (APJAC) అమరావతి ఉద్యోగుల సంఘం శనివారం విజయవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ ఉద్యోగుల ప్రస్తుత దీనస్థితిని వివరిస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
చాలాకాలంగా రాజధాని లేదనే భావన ఉద్యోగులలో ఉండిపోయిందని, సుస్థిర పాలన కోసం అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా బొప్పరాజు అభినందనలు తెలిపారు. అయితే రాజధానిలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీ (PRC) అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని తప్పుపడుతూ, వెంటనే పీఆర్సీ కమిషనర్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో ఐఆర్ 27% ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దాని గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడేళ్ల నుంచి ఐఆర్ తీసుకుంటున్నారు. మేము ఐఆర్ లేకుండా ఎలా పని చేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. రావాల్సిన బకాయిలు అందకుండానే రిటైర్ అయిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత దీనస్థితిలో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మోదీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ.. ఈహెచ్ఎస్ (EHS) విధానంలో మార్పులు చేసి పూర్తిగా క్యాష్లెెస్ ట్రీట్మెంట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే, ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ‘స్త్రీశక్తి’ పథకం తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగి ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆర్టీసీలో రోజుకొక ఉద్యోగి చనిపోతున్నారని ఆయన వాపోయారు.
ప్రభుత్వంలోని ఏ విభాగంలోనూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేకుండా చేశారని, ఒక్కో ఉద్యోగి నలుగురి పని చేయాల్సి వస్తోందని సంఘం నేతలు మండిపడ్డారు. 2018 నాటి డీఏ అరియర్స్ కూడా ఇంకా 40% మందికి అందలేదని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, పరిష్కారం లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!