పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ భారీగా సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సహాయాన్ని ప్రకటించారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు.…