Amanchi Srinivasa Rao: జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్ సమక్షంలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amanchi Srinivasa Rao: వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోవైపు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేన గూటికి చేరుతున్నారు.. వారాహి 1, వారాహి 2 యాత్రల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలువురు నేతలు.. జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిపిందే కాగా.. ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు ఆమంచి శ్రీనివాసరావు.. ఇక, ఆయనకు సంఘీభావంగా పలు నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Read Also: OTT: అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ఉంటే అంతే సంగతులు.. ఓటీటీకు ప్రభుత్వం వార్నింగ్..
Also Read
కాగా, ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరబోతారనే వార్తలో అప్పట్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యాయి.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించగా.. దానిని విజయవంతం చేయాలని కోరుతూ జనసేన శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతోపాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫొటో ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. నిజంగా శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరుతున్నారా..? లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఫొటోలను ఏర్పాటు చేశారనే అనే చర్చ సాగింది.. కానీ, ఈ రోజు ఆమంచి శ్రీనివాసరావు.. జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు..
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!