Alluri District: ఏపీలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 15 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందిగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది! మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులు ఆహాకారాలు చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలిసలు, అంబులెన్సులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణికులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇంకా సంఖ్య బయటకు రాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
READ MORE: Vemulawada: గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపు.. ఇప్పుడు ఎలా మరీ..?
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!