NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy : గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడింది

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని, నిన్న అప్రాప్రేషన్ బిల్లు పై బీజేపీ మాట్లాడకుండా చేసారన్నారు. మా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. అప్పటికే మేము ఓపికతో ఉన్నామని, బీఅర్ఎస్ నేతలకు ఇష్టం లేకుంటే వాక్అవుట్ చేయాలన్నారు. వెల్ లోకి వెళ్లి అరవడంతో సభ్యులెవరూ మాట్లాడేందుకు రాలేదని, ఈరోజు కూడా వారు చేసిన గొలకి ఓపిక పట్టామన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఆర్థిక సంక్షోభం చేసింది బీఅర్ఎస్ అని, బీఅర్ఎస్ యువతను మోసం చేసి… రాష్ట్రాన్ని అప్పుల కుప్పల మార్చింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

AP Pension Distribution: ఏపీలో తొలి రోజే 96 శాతం మేర పూర్తైన పెన్షన్ల పంపిణీ..

బీఅర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి చేసిందని మహేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. వారి వాయిస్ వారు చెప్పుకోవాలని, ఇతర పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. మేం మాత్రమే మాట్లాడాలి అని ధోరణి ఉండటం ఎవరికి మంచిది కాదని మహేశ్వర్‌ రెడ్డి హితవు పలికారు. స్పేస్ అంత మాకే కావాలని అనడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిన ప్రజాస్వామ్య పద్ధతులను అన్నింటినీ ఎండగట్టామన్నారు. బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడాన్ని బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు.

Ashwini Vaishnaw: కాంగ్రెస్ హయాంతో ఎక్కువ రైలు ప్రమాదాలు.. గణాంకాలతో సహా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..