Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలి

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ప్రభుత్వ మేడలు వంచుతాం ఏలేటి మహేశ్వర్‌ అన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారు, ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, రైతు భరోసా ఎప్పడు ఇస్తారో సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని, 60 లక్షల మంది రైతులు అర్హులుండగా..కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిందన్నారు.

CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

రూ. 49వేల కోట్లు రుణమాఫీకి ఇవ్వాల్సిఉండగా…కేవలం రూ. 17వేల కోట్లే ఇచ్చారని, రుణమాఫీ కాని రైతులను కూడా మోసం చేసేందుకే ధరఖాస్తులు చేసుకొమన్నారు, ఇదీ మోసమే అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకనే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని, రైతులంద‌రికీ రుణాలు మాఫీ చేసామంటున్న సిఎం రేవంత్ రెడ్డి … త‌మ రుణాలు మాఫీ కాలేదంటూ క్షేత్ర స్ధాయిలో నిర‌స‌న‌లు తెలుపుతున్న రైతుల‌కు ఏం స‌మాధానం చెప్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల‌కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ద‌మ్ముంటే గ్రామాల‌కు వెళ్లి పూర్తి స్ధాయిలో రైతుల‌కు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. మూడు విడతల్లో రుణమాఫీ చేసిన రైతుల వివరాలు వారం రోజుల్లోగా ప్ర‌భుత్వం వెల్ల‌డించాలని, పెండింగులో ఉన్న‌ రైతుల రుణాల‌ను ప్రభుత్వం ఈ త్వరలో మాఫీ చేయాలన్నారు. రైతు భ‌రోసా ఖ‌రీఫ్ సీజ‌ను డ‌బ్బుల‌ను ఈ నెలాఖ‌రులోగా రైతుల‌కు ఇవ్వాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..

Exit mobile version