Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవతా విగ్రహాలకు నిత్యం ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన వారణాసి కోర్టు సవాల్ చేస్తూ జ్ఞాన్వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత జస్టిస్ జేజే మునీర్ తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.
1993 సంవత్సరంలో జ్ఞానవాపి వెలుపలి గోడలపై భక్తులను శృంగార గౌరీ, ఇతర దేవతలను పూజించకుండా నిషేధించారనే హిందూ పక్షం వాదన కృత్రిమమని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ఎఫ్ఎ నఖ్వీ వాదించారు. 1993లో మౌఖిక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూజను నిలిపివేసిందన్న హిందూ పక్షం వాదనను ప్రార్థనా స్థలాల చట్టాన్ని దాటవేసే కల్పిత వాదన అని నఖ్వీ కోర్టులో వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఉత్తర్వులు ఇవ్వదని.. అది వ్రాతపూర్వకంగా ఉండాలన్నారు ఆయన ప్రకారం, 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. హిందూ పక్షం వాదనను అంగీకరించినప్పటికీ, 1993లో వారు ఎందుకు దావా వేయలేదని ఆయన ఎత్తి చూపారు. అందువల్ల, వారణాసి కోర్టులో దాఖలు చేసిన ఈ దావా పరిమితి చట్టం కింద నిషేధించబడింది.
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
Bharat Jodo Yatra: దేశ రాజధానిలోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ.. పాల్గొననున్న కమల్ హాసన్
అంతకుముందు ఓ దశలో హిందూ తరపు న్యాయవాదులు జ్ఞానవాపి మసీదుపై హిందూ దేవతల ఉనికిని పాత పటాలు చూపిస్తున్నాయని, హిందూ భక్తులు జ్ఞానవాపి వెలుపలి గోడలపై ఉన్న శృంగార్ గౌరీ, ఇతర దేవతలను క్రమం తప్పకుండా పూజిస్తున్నారని విజ్ఞప్తి చేశారు. 1993 సంవత్సరంలో మాత్రమే అప్పటి ప్రభుత్వం సాధారణ పూజలను నిరోధించింది. కాబట్టి వారికి 1991 చట్టం వర్తించదు. అంతేకాకుండా, వివాదంలో ఉన్న స్థలం వక్ఫ్ ఆస్తి కాదని వారు పేర్కొన్నారు. ఈ స్థలంలో మతపరమైన లక్షణం హిందువులదని.. ముస్లింలది కాదని హైకోర్టులో ఐదుగురు మహిళల తరపున వాదిస్తున్న న్యాయవాది హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. ఈ ప్రదేశంలో పూజలు చాలా కాలంగా జరుగుతున్నాయన్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మాణం చేపట్టారు. ఎవరైనా దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మిస్తే, ఇస్లామిక్ చట్టాల ప్రకారం దానిని మసీదుగా పరిగణించలేము. ఆస్తికి వక్ఫ్ దస్తావేజు లేదని హరి శంకర్ జైన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!