Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవతా విగ్రహాలకు నిత్యం ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన వారణాసి కోర్టు సవాల్ చేస్తూ జ్ఞాన్వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత జస్టిస్ జేజే మునీర్ తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.
1993 సంవత్సరంలో జ్ఞానవాపి వెలుపలి గోడలపై భక్తులను శృంగార గౌరీ, ఇతర దేవతలను పూజించకుండా నిషేధించారనే హిందూ పక్షం వాదన కృత్రిమమని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ఎఫ్ఎ నఖ్వీ వాదించారు. 1993లో మౌఖిక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూజను నిలిపివేసిందన్న హిందూ పక్షం వాదనను ప్రార్థనా స్థలాల చట్టాన్ని దాటవేసే కల్పిత వాదన అని నఖ్వీ కోర్టులో వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఉత్తర్వులు ఇవ్వదని.. అది వ్రాతపూర్వకంగా ఉండాలన్నారు ఆయన ప్రకారం, 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. హిందూ పక్షం వాదనను అంగీకరించినప్పటికీ, 1993లో వారు ఎందుకు దావా వేయలేదని ఆయన ఎత్తి చూపారు. అందువల్ల, వారణాసి కోర్టులో దాఖలు చేసిన ఈ దావా పరిమితి చట్టం కింద నిషేధించబడింది.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Bharat Jodo Yatra: దేశ రాజధానిలోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ.. పాల్గొననున్న కమల్ హాసన్
అంతకుముందు ఓ దశలో హిందూ తరపు న్యాయవాదులు జ్ఞానవాపి మసీదుపై హిందూ దేవతల ఉనికిని పాత పటాలు చూపిస్తున్నాయని, హిందూ భక్తులు జ్ఞానవాపి వెలుపలి గోడలపై ఉన్న శృంగార్ గౌరీ, ఇతర దేవతలను క్రమం తప్పకుండా పూజిస్తున్నారని విజ్ఞప్తి చేశారు. 1993 సంవత్సరంలో మాత్రమే అప్పటి ప్రభుత్వం సాధారణ పూజలను నిరోధించింది. కాబట్టి వారికి 1991 చట్టం వర్తించదు. అంతేకాకుండా, వివాదంలో ఉన్న స్థలం వక్ఫ్ ఆస్తి కాదని వారు పేర్కొన్నారు. ఈ స్థలంలో మతపరమైన లక్షణం హిందువులదని.. ముస్లింలది కాదని హైకోర్టులో ఐదుగురు మహిళల తరపున వాదిస్తున్న న్యాయవాది హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. ఈ ప్రదేశంలో పూజలు చాలా కాలంగా జరుగుతున్నాయన్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మాణం చేపట్టారు. ఎవరైనా దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మిస్తే, ఇస్లామిక్ చట్టాల ప్రకారం దానిని మసీదుగా పరిగణించలేము. ఆస్తికి వక్ఫ్ దస్తావేజు లేదని హరి శంకర్ జైన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!