Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
- అమరావతిలో క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాల భూమి కేటాయింపు..
- 2 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..
- సీఆర్డీఏ కార్యాలయం పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్ భవనం నిర్మాణానికి భూమి కేటాయింపు..
- క్వాంటం భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quantum Valley: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో భాగంగా, రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు పూర్తయింది. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 6తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది.
Read Also: Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
Also Read
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అయితే, శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు, రాజధాని పరిధిలోని ఒక ప్రైవేట్ యూనివర్శిటీలో తాత్కాలిక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సెంటర్ను రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు. ఇక, ప్రతిపాదిత క్వాంటం భవనం గ్రీన్ బిల్డింగ్ రూపకల్పనతో Z+1 ఫ్లోర్ డిజైన్లో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 4,201 చదరపు మీటర్లు కాగా.. గ్రౌండ్ ఫ్లోర్: 1,990 చద.మీ. ఫస్ట్ ఫ్లోర్: 1,996 చద.మీ.. బేస్మెంట్: 210 చద.మీ. అదనంగా: హెడ్రూమ్ 109 చద.మీ., డెక్ ఏరియా 130 చద.మీటర్లుగా ఉండనుంది..
క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్ట్ అమలులో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థగా పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు కంపెనీలతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవన నిర్మాణ వ్యయాన్ని సీఆర్డీఏ మరియు ఐటీ అండ్ ఈ శాఖలు సంయుక్తంగా భరించనున్నట్లు టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం టెక్నాలజీ పాలసీని విడుదల చేసి, అమరావతిని జాతీయ క్వాంటం ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!